పాట్నా రైల్వే స్టేషన్లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకులు రైల్వే ట్రాక్పై పడుకున్నాడు. అదే సమయంలో అతడిపై నుంచి వాస్కోడిగామా రైలు దూసుకెళ్లింది. ట్రాక్ మధ్యలో ఉండడంతో ఆ యువకుడికి ఏమీ కాలేదు. రైలు వెళ్లిన తర్వాత ఆ యువకుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించి, ప్లాట్ఫారం పైకి తీసుకొచ్చారు. ఆ యువకుడికి మతిస్థిమితం లేదని, తరచూ స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటాడని అధికారులు వెల్లడించారు.