భర్తకు ఊపిరాడకుండా చేసి హత్య చేసిన భార్య

525చూసినవారు
భర్తకు ఊపిరాడకుండా చేసి హత్య చేసిన భార్య
కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను భార్య హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. కులాస్ పూర్ గ్రామానికి చెందిన సాయిరెడ్డి (55)ని భార్య రాధా శుక్రవారం హత్య చేసింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వేధింపులు తాళలేక నిద్రలో ఉన్న సాయిరెడ్డిని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు సమాచారం. ఘటన స్థలాన్ని నిజామాబాద్ సౌత్ రూరల్ CI సురేష్ కుమార్, మోపాల్ SIలు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్