ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్ ‘బీటెక్ పానీపూరి వాలీ’గా ఫేమస్ అయ్యారు. దేశవ్యాప్తంగా 40కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి యువ వ్యాపారవేత్తగా రాణిస్తూ స్కూటీ నుంచి కారును కొనే స్థాయికి ఎదిగారు. పానీపూరి బండిని వేరొక చోటుకు తీసుకెళ్లేందుకు ఏకంగా థార్ వాహనాన్ని ఉపయోగించడాన్ని చూసి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో ‘ఎక్స్’లో షేర్ చేసిన మహీంద్రా ఆమె కృషిని అభినందించారు.