ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమేనని అధికారులు చాటి చెప్పారు. అరుణాచల్ప్రదేశ్లోని మలోగం అనే గ్రామంలో కేవలం ఓకే ఒక మహిళా ఓటరు సోకెలా తయాంగ్ ఉన్నారు. ఆమె ఒక్క ఓటు కోసం ఈసీ అక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది. ఆ బూత్కు చేరుకునేందుకు సుమారు 10 మంది అధికారులు 39 కి.మీ కాలినడకన వెళ్లారు. అక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి ఆమె ఓటు హక్కు వినియోగించుకునేలా చేశారు. ఈసీ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.