దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా నిన్న ఈ కార్యక్రమం జరిగింది. మంత్రులుగా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. స్టేజీ వెనకాల చిరుత పులి సంచరిస్తున్నట్లుగా కనిపించింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. "అది పులి కాదు, సాధారణ పిల్లి. న్యూస్ ఛానెల్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ అది క్రూర జంతువుగా ప్రచారం చేశారు. అందులో నిజం లేదు." అని స్పష్టం చేశారు.