హైదరాబాద్ లోని బాచుపల్లి పీఎస్ పరిధి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు మృతిచెందగా నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా మృతులు ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు చెందిన తిరుపతి (20), శంకర్ (22), రాజు (25), ఖుషి, రామ్ యాదవ్ (34), గీత (32), హిమాన్షు (4)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను జేసీబీల సహాయంతో వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు బాచుపల్లిలోని మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.