రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. మహమ్మద్ షమీ, ధ్రువ్ జురెల్ ఈ మ్యాచ్లో ఆడనున్నారు. ఇప్పటికే రెండు మ్యాచులను గెలిచిన ఇండియా నేటి మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని లక్ష్యంతో బరిలోకి దిగనుంది.