టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ పునరాగమానికి సమయం అసన్నమైంది. రైల్వేస్తో జరగనున్న రంజీ మ్యాచ్లో ఢిల్లీ తరపున కోహ్లి బరిలోకి దిగనున్నాడు. కాగా ఢిల్లీ కెప్టెన్ పంత్కు డీడీసీఎ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో కోహ్లిని కెప్టెన్గా వ్యవహరించమని సెలక్టర్లు అడిగితే, కోహ్లి అందుకు తిరస్కరించి అయూష్ బదోనిని కెప్టెన్గా కొనసాగించమని సూచించాడట. దీంతో బదోని సారథ్యంలో కోహ్లి ఆడనున్నాడు.