ఆతిశీకి సమన్లపై సీఎం కేజ్రీవాల్‌ స్పందన ఇదే!

74చూసినవారు
ఆతిశీకి సమన్లపై సీఎం కేజ్రీవాల్‌ స్పందన ఇదే!
ఢిల్లీ కోర్టు పరువు నష్టం కేసులో ఆప్ నాయకురాలు ఆతిశీకి సమన్లు జారీ చేయడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘తర్వాత అరెస్టు ఆతిశీదేనని ముందే నేను చెప్పాను, ఇప్పుడు ఆ దిశగానే వాళ్లు ప్లాన్‌ చేస్తున్నారు’ అని ఆరోపించారు. నకిలీ కేసుల్లో ఆప్ నేతలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తారని హెచ్చరించారు. దేశాన్ని నియంతృత్వం నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్