ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహిస్తారు. నోబెల్ పురస్కార గ్రహీత, రెడ్క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడూన్ హంట్ పుట్టిన రోజు(మే 08, 1863)న ఈ దినోత్సవం జరుపుకుంటారు. 1859లో రెండవ ఇటాలియన్ స్వాతంత్య్ర యుద్ధంలో ఇటలీలోని సోల్ఫెరినో యుద్ధభూమిలో 40వేల మంది చనిపోవడం డునాంట్ చూసి చలించిపోయి ఈ సంస్థను స్థాపించారు. మొదటి రెడ్క్రాస్ దినోత్సవాన్ని మే 8, 1948న జరుపుకోగా, 1984లో అధికారికంగా ‘‘వరల్డ్ రెడ్ క్రాస్ డే’’ నిర్వహించారు.