తన తల్లి మేనకా గాంధీ తరుపున ఫిలిబిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ గురువారం యూపీలోని సుల్తాన్పూర్లో ప్రచారం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో కొంత కాలంగా ఆయన సైలెంట్గా ఉన్నారు. ప్రస్తుతం తల్లి తరుపున ఎన్నికల రంగంలోకి ఆయన దిగనున్నారు. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో 11 సమావేశాల్లో ప్రసంగిస్తారని
బీజేపీ నేతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలతోనూ ఆయన భేటీ కానున్నారన్నారు.