గతేడాది ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడి తీవ్ర యుద్ధానికి దారితీసింది. అనేకమంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు.. వారిని చిత్ర హింసలకు గురిచేసి ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు మహిళా సైనికులను నిర్బంధించి, చిత్రహింసలు పెట్టిన కొన్ని వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. దీనిపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. హమాస్ అంతం తప్పదని హెచ్చరించారు.