విషాదం.. హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి

73చూసినవారు
విషాదం.. హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి
పవిత్ర హజ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. యాత్రలో ఎండ వేడిమికి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందార‌ని మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. మృతి చెందిన వారిలో అత్యధికంగా ఈజిప్షియన్లు 323 మంది కాగా.. 60 మంది జోర్డానియన్లు ఉన్నారు. ప్రస్తుతం మక్కాలో 50డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది 240కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్