జర్నలిస్టును కాల్చి చంపిన దుండగులు

57చూసినవారు
జర్నలిస్టును కాల్చి చంపిన దుండగులు
పాకిస్థాన్‌లో ఖలీల్ జిబ్రాన్ అనే జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఖైబర్ జిల్లాలోని మజ్రినా సుల్తాన్‌ఖేల్ ప్రాంతంలో ఉన్న ఖలీల్ ఇంటి వద్దే అతడిపై కాల్పులు జరిపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో సాజిద్ అనే మరో వ్యక్తి కూడా గాయపడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్