యూపీలోని కాస్గంజ్ జిల్లా తాతర్పూర్ హజారా కెనాల్ వద్ద గురువారం విషాద ఘటన జరిగింది. విహార యాత్రలో భాగంగా 9 మంది యువకులు కెనాల్ వద్దకు వచ్చారు. అందులోకి దిగి స్నానం చేస్తుండగా కొట్టుకుపోయి చనిపోయారు. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. కాస్గంజ్ డీఎం సుధా వర్మ, ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ అక్కడి గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.