ఉగ్రవాదులు వారి దేశాలకు పారిపోయినా, వారిని వెంటాడి మరీ హతమార్చుతామని ప్రధాని మోడీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాఖండ్ రిషికేశ్లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సైనికులకు కనీసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా ఇవ్వలేదని మోడీ ఆరోపించారు. BJP అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందన్నారు. యుద్ధ విమానాలు, రైఫిల్స్ దేశీయంగా తయారు చేసుకునే సామర్థ్యం పెంచామన్నారు.