ముంబైలో రైలు- లారీ ఢీకొంది. ముంబై నుంచి వస్తున్న అమరావతి ఎక్స్ప్రెస్ బోడ్వాడ్ రైల్వేస్టేషన్ వద్ద ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టమూ సంభవించలేదని రైల్వే పోలీసులు తెలిపారు. భుస్వాల్-బందేరా జంక్షన్ వద్ద సదరు లారీ రైల్వే ట్రాక్ను క్రాస్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.