ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగద్ ఎక్స్ప్రెస్ రైలు బక్సర్లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రైలు కోచ్లు రెండు భాగాలుగా విడిపోవడం కలకలం రేపింది. న్యూఢిల్లీ నుంచి పట్నా వెళ్తున్న రైలు ధరౌలీ వద్ద అకస్మాత్తుగా రెండు భాగాలుగా విడిపోయింది. ఒక భాగం ఇంజిన్తో పాటు ముందుకెళ్లగా, మరోభాగం వెనకాల ఆగిపోయి పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.