ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్, ఆసీస్ మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు తమ ప్రిడిక్షన్ చెప్పారు. తాజాగా సంజయ్ మంజ్రేకర్ భారత్ గెలవాలంటే ట్రావిస్ హెడ్ను త్వరగా ఔట్ చేయాలని సూచించారు. హెడ్ను త్వరగా ఔట్ చేస్తే భారత్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.