పోలింగ్ రోజు ఈవీఎంలు పగలగొట్టి, హింసకు దిగి ఆ తర్వాత పరారైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సోషల్మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి. ‘నేను నేరుగా చెబుతున్నాను.. నాకు మాచర్లకు రావాలంటే 2 గంటలు అన్నోడు 2 కార్లు మార్చి ఎందుకు పారిపోయాడు..?’ అని ఎద్దేవా చేస్తున్నారు. ‘పులిరా.. పులిరా పెద్ద పులిరా.. ఈవీఎంలు పగలగొట్టి పారిపోయేరా..’ అని వ్యంగాస్త్రాలు విసురుతున్నారు.