ఒక ప్రముఖ మీడియా ప్రతినిధితో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ 'కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. ఒక ఇన్స్టిట్యూషన్. శూన్యంలో నుంచి సునామీ సృష్టించాను. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తెలంగాణ ప్రజల కోసం స్వయంగా ఒక పార్టీని స్థాపించి, ఆ పార్టీని ఒక మహా సుడిగాలిగా, మహోధృతమైన ఉద్యమ రూపంలో నడిపి, అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. తదనంతరం పదేళ్ళు కులం, మతం, జాతి, వివక్ష లేకుండా పాలించాను' అని అన్నారు.