రాంచీ టెస్టులో గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. నిలకడగా రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ (55) పెవిలియన్కు చేరాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్లో రోహిత్ స్టంపౌట్ అయ్యాడు. దీంతో 99 పరుగుల వద్ద టీంఇండియా మరో వికెట్ను కోల్పోయింది. క్రీజ్లోకి రజత్ పటీదార్ వచ్చాడు. భారత్ విజయానికి ఇంకా 93 పరుగులు అవసరం.