TG: పండగ రోజు రాష్ట్రంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ లంగర్హౌస్ చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించడానికి వచ్చిన కరీం(40), సాహిల్(22) అనే GHMC కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గుర్రపు డెక్కను తొలగిస్తున్న క్రమంలో సాహిల్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోగా.. కాపాడేందుకు వెళ్లిన కరీం కూడా మునిగి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.