ఉగాది పండుగను పురస్కరించుకుని సెలెక్ట్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘ఉగాది ఆఫర్ల వర్షం’ అనే నినాదంతో ప్రకటించిన ఈ ఆఫర్లలో 7.5 శాతం నుంచి 75 శాతం వరకు తగ్గింపు ధరకు మొబైళ్లను విక్రయిస్తున్నట్లు కంపెనీ CMD గురు తెలిపారు. ఈ ఆఫర్లు స్మార్ట్ఫోన్లతో పాటు టీవీ, ట్యాప్టాప్, విడిభాగాలకు కూడా వర్తిస్తుందన్నారు. వీటితోపాటు HDFC బ్యాంక్ కార్డుపై 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు.