2024-25 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ జూలై మూడో వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఆ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. కచ్చితమైన ప్రణాళిక, సమగ్ర విశ్లేషణతో బడ్జెట్ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.