KTR వ్యాఖ్యలపై తెలంగాణ అసెంబ్లీలో దుమారం రేగుతోంది. 3 శాతం కమీషన్ అంటూ KTR మాట్లాడంపై మంత్రి భట్టి, కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. KTR క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. KTR కామెంట్స్ను రికార్డు నుంచి స్పీకర్ తొలగించారు. 'మీలా బరితెగించి రాజకీయాలు చేయడం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు. అడ్డగోలుగా దోచుకున్నది మీరు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి' అని భట్టి KTRకి వార్నింగ్ ఇచ్చారు.