ఉత్తమ్‌ను మంత్రి వర్గం నుండి తొలగించాలి: ఎంపీ అర్వింద్

81చూసినవారు
ఉత్తమ్‌ను మంత్రి వర్గం నుండి తొలగించాలి: ఎంపీ అర్వింద్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలపై రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. మంత్రి వర్గం నుండి ఉత్తమ్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ మతవిధ్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉత్తమ్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్