VIDEO: రూ.4 లక్షలకు పిల్లల అక్రమ విక్రయాలు

582చూసినవారు
ఢిల్లీ, పూణే, ఏపీ నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా 3 నెలల పసికందుల నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు లేనివారికి చిన్నారులను రూ.4 లక్షల నుంచి రూ.5.50 లక్షలకు అమ్ముతున్నారు. పెంచుకుంటున్న వారి వద్ద నుంచి పిల్లలను తీసుకుని శిశు సంరక్షణ అధికారులకు అప్పగించారు పోలీసులు.

సంబంధిత పోస్ట్