చిరుత దాడిలో దూడ మృతి

74చూసినవారు
చిరుత దాడిలో దూడ మృతి
మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు కు చెందిన బర్రె దూడపై శనివారం రాత్రి దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఆదివారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. దూడపై చిరుత దాడిని నిర్ధారించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, బోన్ వేసి చిరుతను బంధిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్