కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రానికి నూతన డిగ్రీ కళాశాల మంజూరు సందర్భంగా గురువారం పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ డిగ్రీ కళాశాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాల మంజూరుతో కొడంగల్ నియోజకవర్గ విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.