ఓయో హోటల్ లో అగ్ని ప్రమాదం

2925చూసినవారు
చైతన్యపురి మోహన్ నగర్ లోని ఓయో హోటల్ లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని ఎల్బీ నగర్ ఫైర్ సిబ్బంది కాపాడారు. ఈ ప్రమాదంలో ఊపిరాడక ఇద్దరు అస్వస్థతకు గురైయ్యారు. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మూడు ఫైర్ ఇంజెన్ లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్