వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని పెద్ద మాధారం గ్రామంలో శుక్రవారం మాజీ సర్పంచ్ వెంకటేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం గ్యారంటీ పథకాలన్నీ సంపూర్ణంగా అమలవుతాయని, ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మకూడదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.