వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మంచన్పల్లి గ్రామానికి చెందిన తరుణ్ ఐఏఎస్ సాధించడంతో బుధవారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అతనిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు తరుణ్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లేష్, మాజీ సర్పంచ్ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.