వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు

75చూసినవారు
వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పరిగి పట్టణంలో స్థానిక ఎస్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు, కేంద్ర బలగాలు, పలు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలిస్తే సీజ్ చేస్తామని అన్నారు. 50 వేలకు మించి నగదు తీసుకు వెళ్ళకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్