వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో మంగళవారం పండగ పూట విషాదం చోటుచేసుకుంది. మామిడి ఆకులు, కాయలు తెంపేందుకు పొలానికి వెళ్లి పొలానికి వేసిన విద్యుత్ కంచెకు తగిలి చెట్టు ఫై నుండి పడి రాములు గౌడ్ (55) మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.