వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూర్, కోస్గి, గండీడ్ తదితర ప్రాంతాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాల వద్ద భక్తులతో కిటకిటలాడింది.