పదో తరగతి ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలవడానికి కారణాలు తెలుసుకుంటున్నామని మంగళవారం జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి తెలిపారు. గతేడాదిలాగే ఈసారీ చివరి స్థానమే దక్కింది. ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత 6 శాతం పెరిగింది. ఇది కొంతవరకు సంతృప్తినిచ్చింది. వచ్చే సంవత్సరం బాగా కష్టపడతాం. మెరుగైన ఫలితాలు సాధిస్తాం అని అన్నారు.