భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐసీసీ టైటిల్స్ అందుకున్న రెండో భారత క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. అండర్-19 వరల్డ్ కప్ (2008), వన్డే ప్రపంచ కప్ (2011), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2013), టీ20 ప్రపంచ కప్ (2024) ట్రోఫీలు కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. విరాట్ కోహ్లీ కంటే ముందు మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నాలుగు ఐసీసీ టైటిల్స్ సాధించాడు. కాగా, ధోనీ మూడే ట్రోఫీలు సాధించడం గమనార్షం.