రూ.19వేల కోట్ల వాటాలు విక్రయించనున్న వొడాఫోన్

70చూసినవారు
రూ.19వేల కోట్ల వాటాలు విక్రయించనున్న వొడాఫోన్
మొబైల్ ఫోన్ టవర్ ఆపరేటర్ ఇండస్‌లో వోడాఫోన్ 21.5 శాతం వాటాను కలిగి ఉంది. దాదాపు రూ.19 వేల కోట్ల విలువైన ఆ వాటాను విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. స్టాక్ మార్కెట్ బ్లాక్ డీల్స్ ద్వారా వచ్చే వారం సేల్ చేయవచ్చని వొడాఫోన్ వర్గాలు తెలిపాయి. రుణభారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ వార్త అందిన తర్వాత వోడాఫోన్ ఐడియా షేర్ విలువ 4.8 శాతం, ఇండస్ టవర్స్ షేరు 0.3 శాతం పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్