కాంగ్రెస్‌-ఎస్పీ కూట‌మికి ఓటు వేస్తే పాపం: సీఎం యోగి

85చూసినవారు
కాంగ్రెస్‌-ఎస్పీ కూట‌మికి ఓటు వేస్తే పాపం: సీఎం యోగి
కాంగ్రెస్‌-ఎస్పీ కూట‌మిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. విప‌క్ష ఇండియా కూట‌మి అధికారంలోకి వ‌స్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు కోత విధించి ముస్లింల‌కు పంచుతార‌ని ఆరోపించారు. దేశాన్ని ఇస్లామీక‌రించేందుకు, తాలిబన్ల వ్య‌వ‌స్ధ‌ను అమ‌లు చేసే క్ర‌మంలో దేశాన్ని విభ‌జించేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని మండిప‌డ్డారు. యూపీలో గోవ‌ధ నిషేధ‌మ‌ని, కాంగ్రెస్‌-ఎస్పీ కూట‌మికి ఓటు వేస్తే పాపం చేసిన‌ట్టేన‌ని అన్నారు.

సంబంధిత పోస్ట్