గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్

61చూసినవారు
పలిమెల మండలం పంకెన గ్రామంలో శుక్రవారం మహదేవ్పూర్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సై తమాషారెడ్డి పాగే రాజు అనే వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు. 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. కొన్నిరోజులుగా గంజాయి యువతకి అమ్ముతున్నాడని తెలిసిందన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఎం చేస్తున్నారని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని లేదంటే, ఇలా వ్యసనాలకు బానిసలుగా మారుతారన్నారు.

సంబంధిత పోస్ట్