జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామంలో ఉరుములు, మెరుపులు, తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షం పడిందని గ్రామస్తులు తెలిపారు. శనివారం ఈక్రమంలో గ్రామంలోని ఒక ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టు పై పిడుగు పడటంతో చెట్టు మొత్తం
కాలిపోయిందని తెలిపారు. అకస్మాత్తుగా పిడుగు పడడంతో భయాందోళనకు గురయ్యామని తెలిపారు. అకాల వర్షం వల్ల పంట నష్టం వాటిల్లిందని వివరించారు.