జనగాం నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రత్యేక పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించిన మోగిళ్ల నరసింహారెడ్డి పదవీకాలం నేటితో పూర్తయినందువల్ల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా పూలమాలలు, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు బాలరాజు, పల్లె రజిత, బోకోరి బాల్రెడ్డి, బట్టు మోహన్ రెడ్డి పాల్గొన్నారు.