జనగామ జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీ (వీవర్స్ కాలనీ)లో నివాసముంటున్న మదురై కి చెందిన భార్య భర్తలు సెల్వరాజ్ (55), సెల్వరాజ్ భాగ్యలక్ష్మి (45) లు భుధవారం తమ ఇంటికి తాళం వేసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వీరిద్దరూ కుటుంబ కలహాలతో మృతి చెందారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.