మృతుడి కుటుంబానికి అండగా శివాజీ యువజన సంఘం

50చూసినవారు
మృతుడి కుటుంబానికి అండగా శివాజీ యువజన సంఘం
జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూర్ మండలం సలాఖపూర్ గ్రామానికి చెందిన గడిపే సామెలు ఇటీవల మృతి చెందారు. శనివారం వారి కుటుంబానికి స్థానిక శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఏ ఇంటికి ఆపద వచ్చిన మా శివాజీ యువజన సంఘం సహాయం చేసేందుకు ముందు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్