ఉమ్మడి వరంగల్ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఎక్కేలా గ్రామంలో పిడుగుపడి యువకుడు మృతి చెందారు. ఆదివారం స్థానికుల సమాచారం ప్రకారం పొలం వద్ద కల్లాల్లో వడ్లు ఆరబోస్తుండగా పిడుగు పడి ఉపేందర్ (26 సంవత్సరాలు) అనే యువకుడు మృతి చెందినట్లు వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.