ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ

56చూసినవారు
ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ
ములుగు జిల్లా మంగపేట మండలం అబ్బాయిగూడెం ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు రాక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి మంగళవారం ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడారు. టీచర్లు గత 3 నెలల నుండి సరిగా హాజరు కావడం లేదన్నారు. కాగా పాఠశాల తరగతి గదిలో ఫ్యాన్లు, బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాలకు హాజరు కాని టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్