రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత అధికంగా ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శుక్రవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కూలీ పనులకు వెళ్ళే వారు త్వరగా పనిముగించుకొని ఇంటికి చేరుకోవాలన్నారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నాయని, తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్నారులు, వృద్ధులు ఎండ తీవ్రత తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నారు.