డబ్బులు చెల్లించాలని ఎంపిడిఓ కార్యాలయం ఎదుట ధర్నా

79చూసినవారు
ములుగు జిల్లాలో ఉపాధిహామీ కూలీల వేతనాలు చెల్లించాలంటూ ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఎంపిడిఓ కార్యాలయం ఎదుట వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గ్యానం వాసు మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీల డబ్బులు రూ. 3 కోట్లు పెండింగులో ఉన్నాయన్నారు. ఉపాధి పనిచేసిన కూలీలకు పే స్లిప్పులు కూడా ఇవ్వలేదన్నారు. కూలీల డబ్బులు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్