చల్వాయిలో నిరాశ్రయులైన వారిని కలిసిన డిఎస్పీ నాయకులు

68చూసినవారు
చల్వాయిలో నిరాశ్రయులైన వారిని కలిసిన డిఎస్పీ నాయకులు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొందరి ఇండ్లు కూలిపోవడం జరిగింది. నిరాశ్రయులైన వారిని ధర్మ సమాజ్ పార్టీ ములుగు జిల్లా కన్వీనర్ తరుణ్ మహారాజ్ సోమవారం పరామర్శించి ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ, లక్ష రూపాయల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్